Sunday, May 18, 2008

మరో ధారుణం


మరో చోట బాంబులు. మారో సారి సామాన్య జనాల ప్రాణాలు ఆహుతి అయిపోయాయి. పోలీసులు,రాజకీయనాయకులు అందరూ ఇది తీవ్రవాదుల పని అన్నారు. పత్రికలూ రెండు రోజులు మొదటి పేజీల్లో రాసి మరచిపోయాయి.. మనం కూడా అప్పటికి పేపర్లలో చదివి అయ్యో అనేసి మరచిపోయాం. ఇంకోసారి ఇలాంటి సంఘటన జరిగేంతవరకు మనకు తీవ్రవాదం గుర్తుకురాదు. ఎందుకంటే మన దేశం లో ప్రాణానికి అంత విలువ లేదు కాబట్టి.
ఈ తీవ్రావాదులో ఎవరో కూడా బాగా తెలుసుకున్నారు. పెద్ద నాయకుల్ని హత్యచేస్తే పట్టుబడే అవకాశాలు ఎక్కువ. రాజీవ్ గాంధీ ని చంపినవాళ్ళు దొరికారు, ఇందిరాగాంధీ ని చంపినవల్ల ని కూడా పట్టుకున్నారు. ఢిల్లీ లో ,హైదరాబాద్ లో బాంబులు పెట్టినవాళ్లు ఏమయ్యారు, వారణాసి లో బాంబులు పెట్టినా మనకు అసలు ఏమీ పడదు.

మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపే బాధ్యత ఎవరిది?
అసలు ఇలాంటివి జరిగిన మరుసటి రోజే ఏమీ జరగనట్టు సాధారణ పరిస్థితి నెలకొంటుంది . ఇది చూసే న్యూయార్క్ టైమ్స్ రైటర్ అంటాడు ఇది Indifference or resilience ? నాకయితే మొదటిదే కరెక్ట్ అనిపిస్తుంది. రోజు తీవ్రవాదుల మధ్య బ్రతుకుతూ వారితో పోరాడే ఇజ్రాయిల్ వాళ్ళది resilience .
ప్రపంచం లో తీవ్రవాదం తో అత్యధికంగా నష్టపోతున్నది ఇండియా కాని మనకు తీవ్రవాదం ఎదుర్కోవడానికి ఒక comprehensive plan లేదు. మనకు, మన నాయకులకు ఇలాంటివి అసలు ఆలోచించడానికి టైం ఎక్కడ? బాలీవుడ్ , IPL ఇవి అంతకంటే చాలా ముఖ్యం.

No comments: