కాంగ్రెస్ , లెఫ్ట్ పార్టీల మధ్య అణు ఒప్పందం గొడవ ఈరోజు పార్లమెంట్ లో డబ్బులు జల్లడం తో ముగిసింది. ఇందులో ఎవరు ఎంత నిజం చెప్పుతున్నారో కనుక్కోవడం కష్టం కానీ అభాసు పాలయింది మాత్రం మన ప్రజాస్వామ్యమే. నేషనల్ పార్టీలు ,ప్రాంతీయ పార్టీలు అన్నీ దేశ భవిష్యత్తు కంటే తమ భవిష్యత్తే ముఖ్యం అని ప్రజలని వెర్రి వాళ్లు చేస్తే , T.V , మీడియా అన్నీ ఏక్తా కపూర్ సీరియల్ ( సాంస్, బహు ) లాగా మనకు నిమిషానికి ఒక ట్విస్ట్, టర్న్ ఇచ్చి రేటింగ్స్ పెంచుకున్నాయి. ఎప్పుడూ కత్తులు దూసుకొనే భా .జ.పా. , లెఫ్ట్ పార్టీలు ఫ్రెండ్స్ అయ్యాయి. చంద్రశేఖర్ రావు లాంటి అవకాశవాదులు తమ కోర్కెలకు , ఓటింగ్ కు లింకు పెట్టారు. ఇండిపెండెంట్లు తమ అదృష్టానికి తామే మురుసిపోయి ఎవరో ఒకరి దగ్గరి దగ్గరు డబ్బులు తీసుకుని ( 20 కోట్ల నుండి 100 కోట్ల వరకు ) ఏదో ఒక గ్రూపు లో చేరిపోయారు. మనం మాత్రం ఏమి చేయగలం జై హింద్ అనడం తప్ప. ఏదో ad లాగా It happens only in India.
Showing posts with label vote of trust. Show all posts
Showing posts with label vote of trust. Show all posts
Sunday, July 20, 2008
Subscribe to:
Posts (Atom)